భారతీయ జనతా పార్టీ అధికారిక వెబ్ సైట్ మంగళవారం హ్యాకింగ్కు గురైంది. వెబ్సైట్ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు.
వెబ్ సైట్ తెరవగానే ప్రధాని మోది ఫోటోలతో పాటు జర్మనీ వైస్ ఛాన్సలర్ మార్కెల్ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.
ఆ ఫొటోలో మార్కెల్కు మోది కరచాలనం చేయబోతుంటే ఆమె దూరంగా జరుగుతున్నారు. అంతే కాకుండా ‘సోదర సోదరీమణులారా.. నేను మిమ్మల్నందరినీ ఫూల్ చేశా.. మేమందరం మిమ్మల్ని ఫూల్స్ చేశాం. ఇంకా ఇలాంటివి చాలా రానున్నాయి. కంగ్రాట్స్..’ అంటూ మోది అన్నట్లు అందులో రాసుకొచ్చారు.
పార్టీ వర్గాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం సైట్ ఆఫ్ లైన్ మోడ్లో ఉన్నది.
బిజెపి వెబ్ సైట్ను హ్యాక్ చేసింది తామే అంటూ ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించుకోలేదు.
రెండు వారాల క్రితం చత్తీస్గఢ్ బీజేపీ అధికారిక వెబ్ సైట్ను పాకిస్థాన్కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారు.