Bomb Threat Email To Schools: కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని నాలుగు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దుండగుల ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయా పాఠశాలల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు స్క్వాడ్ ను రంగంలోకి రంగంలోకి దింపి ఆ పాఠశాలలో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు కొనసాగుతున్నాయనీ, ఇప్పటి వరకూ ఎలాంటి బాంబులు దొరకలేదని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మీడియాకు తెలియజేశారు. ఆ బెదిరింపు ఈ మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. పాఠశాలల్లో బాంబులు ఎక్కడా లేకపోవడంతో యాజమాన్యాలు ఊపిరిపీల్చుకున్నాయి.
Bomb Threat Email To Schools: విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన
పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురైయ్యారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులను పాఠశాలల నుండి ఖాళీ చేయించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. గత కొంత కాలంగా కర్ణాటకలో హిజాబ్ పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. తాజాగా హలాల్, హజాన్ పై కూడా రగడ జరుగుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ ఖదా కూడా హిజాబ్ వివాదంపై ఇప్పటికే స్పందించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఓ వీడియో కూడా విడుదల చేసింది. దానిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఇప్పిటకే విచారణ కూడా ఆదేశించారు. ఈ తరుణంలో పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కల్గిస్తొంది. ఈ బెదిరింపు వచ్చిన పాఠశాలలే కాకుండా ఇతర పాఠశాలల్లోనూ ముందు జాగ్రత్తగా తనిఖీలు చేయిస్తున్నారు.