Central government:మరికొన్ని నెలలలో ప్రతి ఒక్క భారతీయునికి ఒకటే డిజిటల్ ఐడీ అందుబాటులోకి రానుంది. వన్ నేషన్.. వన్ ఐడీ ఇండియాలో భాగంగా అందరికీ ఇది అందుబాటులోకి రానుంది. మిగతా డాక్యుమెంట్లు అయినటువంటి ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు వంటివన్ని దీనికి అనుసంధానించనుంది మన కేంద్ర ప్రభుత్వం. మైటీ (ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ) ఈ కొత్త టెక్నాలజీపై వర్క్ చేస్తోంది.
Dr Sajja Lokeswara Rao: చీరాల బిడ్డకు లండన్ లో ఖ్యాతి.. ఈ వైద్యుడి కథ స్పూర్తిదాయకం..!
Central government: వన్ నేషన్.. వన్ ఐడీ ముఖ్య ఉద్దేశం ఇదే..
ఐడీ కార్డులను నియంత్రణలో ఉంచేందుకు అలాగే ప్రతి ఒక్క పౌరునికి డిజిటల్ సాధికారత కల్పించేందుకు ఈ డిజిటల్ ఐడీ ఉపయోగపడనుంది. త్వరలోనే ఈ డిజిటల్ ఐడీ ప్రతిపాదన ప్రతీ రాష్ట్రంలోకి అందుబాటులోకి రానుంది. ఈ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఐడెంటీతో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అన్ని ఐడెంటీ కార్డులను లింక్ చేయనున్నారు. EKYC ద్వారా ఇతర థర్డ్ పార్టీ సర్వీసులను పొందేందుకు కూడా ఈ డిజిటల్ ఐడీని వాడనున్నారు. డ్రాఫ్ట్ ప్రతిపాదన ప్రకారం పదేపదే వెరిఫికేషన్ చేపట్టే ప్రక్రియలను ఈ డిజిటలైజేషన్ తొలగించనుంది.
Bike Loan: బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఆ బ్యాంకులో మీకు తక్కువ వడ్డీకే ఋణం దొరుకుతుంది.. ప్రయత్నించండి!
దీనివలన ఉపయోగాలు ఇవే…
ఇకపోతే మూడు సంవత్సరాల క్రితమే ఈ ప్రతిపాదన వచ్చింది. 2017లోనే ఈ డిజిటల్ ఐడీ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మనందరికీ తెలిసిందే.. ఇండియా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ 2.0 కింద ఈ ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ ప్రజెంట్ చేసింది. ఆ తర్వాత దీన్ని అప్డేట్ చేసి ప్రకటించింది. సో మిత్రులారా వన్ నేషన్.. వన్ ఐడీ ఐడియా త్వరలో జనాల్లోకి రానుంది. ఇక మీరు డజెన్లు కొద్దీ ఐడీ కార్డులను మీ జేబులలో పెట్టుకొని తిరగాల్సిన పనిలేదు.