ప్రముఖ బాలల హక్కుల నేత అచ్యుతరావు మలక్ పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అచ్యుతరావు ప్రముఖ ఈనాడు దిన పత్రిక కార్టూనిస్టు శ్రీధర్ కు సోదరుడు. ఇటివల కరోనా వైరస్ కు గురైన అచ్యుతరావు 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ ఆయన మృతి చెందారు.
వామపక్ష భావాలున్న అచ్యుతరావు బాలల హక్కుల ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బాలబాలికలకు ఎక్కడ సమస్య ఉన్నా ఆయన ఆదుకునే వారు. విద్యార్ధి దశ నుంచే పోరాటాల వైపు ఆయన ఆలోచనలు ఉండేవి. సీపీఐ అనుబంధ విద్యార్ధి సంఘం ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ శాఖలో క్రియాశీలకంగా పని చేశారు. అనంతరం దశాబ్దాల పాటు బాలల హక్కుల కోసం అవిరళ కృషి చేశారు. భార్య అనురాధతో కలిసి బాలల హక్కుల సంఘం కూడా స్థాపించారు. ప్రస్తుతం కూడా ఆయన బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడిగానే ఉన్నారు. ఆ హోదాలోనే ఆయన మృతి చెందారు.