కరోనా వైరస్ మొట్టమొదటిసారి చైనా దేశంలోని వుహాన్ నగరంలో బయటపడిందన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ దానిని చైనా కుట్రపూరితంగా ప్రపంచం పైకి వదిలింది అని అనేకమంది ఆరోపిస్తూ ఉంటారు. చైనా కూడా వారి వాదనకు తగ్గట్టుగానే చాలా అనూహ్యంగా మూడు నెలల్లోనే ఈ వైరస్ బారినుండి కోలుకుంది. అయితే ఇప్పుడు చైనా దేశానికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
చైనా దేశ రాజధాని అయిన బీజింగ్ నగరంలో బుధవారం కొత్తగా 31 కేసులు నమోదు కావడంతో వెంటనే అధికారులంతా నగరవాసులను ఇల్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇక దేశంలోని స్కూళ్ళు అన్నింటిని పరిస్థితికి తగ్గట్లు మూసివేయమని ఆదేశాలు జారీ చేయగా… బీజింగ్ లో అయితే తక్షణమే 1200 విమానాలను క్యాన్సిల్ చేసేశారు. చైనాలో రెండోసారి ఈ వైరస్ ప్రభావం మొదలవడంతో ఆ దేశస్థులంతా విపరీతంగా భయపడుతున్నారు.
ఈసారి వచ్చినది చాలా విపరీతమైన కరోనా వైరస్ క్లస్టర్ అని భావిస్తున్న అధికారులు దాదాపు లక్షల మంది మరలా దీని బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే ఈసారి కేసులు క్రితం సారి లాగే గ్జిన్ఫాడి అనబడే హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ నుండి బయటకు వచ్చినవి కావడంతో వారి భయం ఇంకా ఎక్కువైంది.
ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని టెస్టులు చేయగా 30 మందికి పాజిటివ్ అని బయటపడటం గమనార్హం. ఇక చైనాలో ఇప్పటికే లాక్ డౌన్ లేకపోవడంవల్ల ఈ వైరస్ ప్రభావం భారీగా ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఏకంగా 30,000 మందిని క్వారంటైన్ కు పంపారంటేనే పరిస్తితిని అర్థం చేసుకోవచ్చు.