నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరినైనా సరే దేనికైనా రెడీ అనే ధోరణిలో ఆయన వ్యవహార శైలి ఉంది.సాక్షాత్తు అధినేత జగన్ని ఆయన లెక్కపెట్టలేదు.ప్రభుత్వ విధానాలని విమర్శించడానికి వెనుకాడలేదు.
తాజాగా ఒక టీవీ చానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో కూడా రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ ఎమ్మెల్యేలను చెడుగుడు ఆడారు.ఇంతకీ రఘురామకృష్ణం రాజుకు ఇంత ఇంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చిందీ అంటే అదంతా ఢిల్లీలోని ఒక కేంద్ర మంత్రి ఇచ్చిన బలమైన మద్దతు లోంచి పుట్టుకు వచ్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఢిల్లీలో మంచి కనెక్షన్లు ఉన్న రఘురామకృష్ణంరాజు గతంలో కొన్నాళ్లు బిజెపి సావాసం కూడా చేసిన విషయం ఇక్కడ గమనార్హ౦.అదే ఇప్పుడు రామకృష్ణ౦రాజుకు లభిస్తోందని, ముఖ్యంగా ఒక సీనియర్ కేంద్ర మంత్రి అండదండలు ఆయనకు పూర్తిగా ఉండటంతో నరసాపురం ఎంపి ఎక్కడా వెనకడుగు వేయడం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు
ఆ చర్చా కార్యక్రమంలో ఆయన ఓ ఎమ్మెల్యేని ఇసుక దొంగ అన్నారు.. ఇంకో ఎమ్మెల్యేని ఏకంగా కరోనా సహాయ నిధి పేరుతో వసూళ్ళకు పాల్పడుతున్నారన్నారు.. దాంతో ఎమ్మెల్యేలకు ఒళ్ళు మండింది.. రఘురామకృష్ణంరాజుపై దుమ్మెత్తిపోశారు. రఘురామకృష్ణంరాజు ఊరుకుంటారా.? ‘సింహమే సింగిల్గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయి..’ అంటూ తనదైన స్టయిల్లో రిటార్ట్ ఇచ్చారు. ‘బస్తీ మే సవాల్.. దమ్ముంటే రాజీనామా చెయ్..’ అని ఆ ఎమ్మెల్యేలు సవాల్ విసిరితే, ‘నేను రాజీనామా చేస్తాను.. నాతోపాటు మీరూ రాజీనామా చెయ్యండి.. ఎవరి సత్తా ఎంతో తేలిపోతుంది..’ అంటూ ప్రతి సవాల్ విసిరారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
మొత్తమ్మీద రఘురామకృష్ణంరాజు వైసిపి పరంగా ఎదురయ్యే ఏ సమస్యనైనా క్రమశిక్షణా చర్య నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే ఇంత తెగింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్నది సుస్పష్టం. అయితే ఆయనకు ఎంత ధీమా కల్పిస్తున్నది బిజెపి కేంద్ర మంత్రి నన్నది కూడా అంతే వాస్తవం.