మహమ్మారి కరోనా వైరస్ ఎవరిని విడిచిపెట్టడం లేదన్న సంగతి తెలిసిందే. పేదవాని మొదలుకొని ప్రధాని వరకు ఎవరిని కనికరించడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ కి సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్నా గాని వాటి పనితనం విషయంలో అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా రాణిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక అవకాశాలు అందుకుంటున్న అనసూయ తాజాగా సోషల్ మీడియాలో తనకి కరోనా లక్షణాలు ఉన్నట్లు స్వయంగా వెల్లడించడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది.
బుల్లితెరపై అదేవిధంగా వెండితెరపై ఆకర్షించే అందం తో అనేక అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ టెలివిజన్ స్క్రీన్ పై యాంకర్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించింది. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన అనసూయ అతి తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.
ఇటువంటి తరుణంలో ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. ‘ఓ ఈవెంట్ కోసం కర్నూలు వెళ్లేందుకు ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచాను. ఆ టైంలో నా శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయి.. దీంతో కరోనా లక్షణాలు ఉన్నాయని గ్రహించాను. వెంటనే ప్రయాణాన్ని ఆపుకున్నాను. అంతేకాకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకో బోతున్నాను. ఈ క్రమంలో..ఇటీవలి కాలంలో నాతో కాంటాక్ట్ అయినా వాళ్లకూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరీక్ష చేయించుకుని రిపోర్టును షేర్ చేయండి’ అని ట్వీట్ చేసింది. అనసూయ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.