ప్రపంచం మారుతుంది. కాలంతో పోటీ పడుతుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికతను ఎంత తొందరగా అంది పుచ్చుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. వాహన రంగంలో భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ దే . పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. డీజిల్ రేట్లు దడ పుట్టిస్తున్నాయి. కాలుష్యం కాటేస్తుంది. వాహనదారుల జేబుకు చిల్లు ప్రజల ఆరోగ్యానికి ముల్లు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అవే ఎలక్ట్రికల్ వెహికల్స్. పొల్యూషన్ అసలు ఉండదు. పెట్రోల్ , డీజిల్ తో పనే లేదు. వాహన ప్రియులారా మరి ఇంకెందుకు ఆలస్యం రయ్.. రయ్.. అంటూ ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ట్రై చేయండి.
ఎలక్ట్రిక్ వాహనాల కళకళ..డీజిల్ వాహనాలు వెలవెల. వాహన ప్రియులుకు కార్లతో పాటు అదిరిపోయే బైక్ లు, స్కూటర్లను కూడా వాహాన తయారీదారులు ఆవిష్కరిస్తున్నారు. ఆధునిక సాంకేతికను మిళితం చేసి అద్భుతంగా డిజైన్ చేసిన వాహనాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల దగ్గర సందర్శకుల హడావిడి ఎక్కువగా ఉంది. తొలిసారిగా ప్రపంచానికి ఆవిష్కరించిన టాటా ఆల్ట్రోజ్ ఈవీ. ఎట్టకేలకుభారత్లోకి అడుగుపెట్టింది. టైగర్ ఇ.వి . నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీ తరువాత ఇది మూడవ ఎలక్ట్రిక్ కారు.అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ కానుంది. కారు ఒక ఛార్జీతో 250 కిలోమీటర్లు దూసుకుపోతుంది.
పర్యవరణాన్ని రక్షించాల్సిన అవసరం మనందరిపై ఉంది. కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యతను కరోనా మరోసారి గుర్తు చేసింది. కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. డీ కార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీ సెంట్రలైజేషన్ అమలు చేయనున్నారు.మన వద్ద పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాము. వీటన్నిటిని వినియోగించుకొని కాలుష్యనియంత్రణకు తోడ్పడాలి.బ్యాటరీ స్కూటర్లకు కూడా మార్కెట్లో బాగా డిమాండ్. ఈమధ్య ఎలక్ట్రికల్ టూవీలర్ ఉన్నవారి సంఖ్య బాగా పెరుగుతుంది. కస్టమర్స్ కనుగుణంగా స్కూటర్స్ లో స్పీడ్, హై స్పీడ్అందుబాటులో ఉన్నాయి.ధర తక్కువ. ప్రయోజనం ఎక్కువ. కాలుష్యం మాటే లేదు.ముందున్న కాలమంతా ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్ దే.