కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని రంగాలతోపాటు రైల్వేకూ భారీగా నష్టం వాటిల్లింది. కరోనా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.
ఇక ఆంక్షలను సడలించాక శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితే కానీ రైళ్లను మళ్లీ పూర్తి స్థాయిలో నడపలేరని తెలుస్తోంది. కానీ మరోవైపు రైళ్లు నడవకపోవడంతో ఆ శాఖకు భారీగా నష్టం వస్తోంది. అయితే ఈ నష్టం వల్ల రైల్వేలోని ఉద్యోగులకు నెల నెలా ఇవ్వాల్సిన వేతనాలను, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా నిలిపివేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఉద్యోగులు, పెన్షనర్లకు రైల్వే శాఖ వేతనాలను నిలిపివేస్తుందనే విషయంపై ఆ శాఖ స్పందించింది. అవన్నీ పుకార్లేనని కొట్టి పారేసింది. రైల్వే ప్రస్తుతం భారీగా నష్టాల్లో నడుస్తున్నా.. ఉద్యోగులకు, పెన్షనర్లకు నెల నెలా రావల్సిన మొత్తాలను అందజేస్తామని తెలిపింది. అలాంటి ఫేక్ వార్తలను నమ్మకూడదని తెలిపింది.
Claim- Railways has decided not to pay salaries to their employees in 2020-21 due to financial crunch.#PIBFactCheck– The claim is #False. No such move is being discussed or contemplated by @RailMinIndia. pic.twitter.com/eshYnDdTqO
— PIB Fact Check (@PIBFactCheck) August 22, 2020
అయితే తమకు కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు రైల్వే శాఖ ఇప్పటికే కేంద్రం నుంచి రూ.53వేల కోట్ల సహాయం కావాలని కోరింది. మరోవైపు రైళ్లలో ఖర్చులను తగ్గించుకునేందుకు కూడా పలు ప్రణాళికలు రచిస్తున్నారు. అందువల్ల రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు ఈ విషయంలో దిగులు చెందాల్సిన పనిలేదని, నెల నెలా వారికి రావల్సిన మొత్తాలు అందుతాయని ఆ శాఖ స్పష్టం చేసింది. అలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని కోరింది.