వెదురు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది…తడికెలు, బుట్టలు, చాటలు , గరిటెలు, మహా అయితే వేణువు.. ఇప్పటివరకు చాలా మంది చూసిన వెదురు ఉత్పత్తులు ఇవే.. ఈ వెదురు కు కాస్తంత టెక్నాలజీ జోడిస్తే సవారీ కి సై అనే ఓ సైకిల్నే సృష్టించవచ్చు అంటుంది ప్రముఖ లైట్ స్పీడ్ మొబిలిటీ సంస్థ.. ఈ కంపెనీ “బాంబూచీ” అనే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలో విడుదల చేసింది.. ఈ సైకిల్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..
అహ్మదాబాద్ కు చెందిన లైట్ స్పీడ్ మొబిలిటీ ఎలక్ట్రానిక్ సైకిల్ తయారీదారి బుకింగ్స్ పై మాత్రమే మే వీటిని తయారు చేస్తుంది. కస్టమర్లకు ఎంత బరువు కావాలో దానికి అనుగుణంగా ఈ సైకిల్ను తయారు చేస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ ఈ సైకిల్ లో ఇన్స్టాల్ చేశారు. పూర్తి ఛార్జింగ్ తర్వాత ఈ సైకిల్ 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. సైకిల్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. అంతే కాకుండా దీని బరువు కూడా తక్కువే. కేవలం 15 కిలోల బరువున్న ఈ సైకిల్ ధర 15 లక్షలు.
అంతేకాకుండా లైట్ స్పీడ్ సంస్థ ప్రస్తుత మోడల్స్ లో ఐదు కమర్షియల్ ఎలక్ట్రికల్ సైకిల్ ఉన్నాయి. ఈ సైకిల్ ధరలు రూ.13 – 25 వేల వరకు ఉన్నాయి. వీటన్నింటిని తక్కువ అల్యూమినియం ఫ్రేమ్ లతో తయారు చేశారు. ఈ సైకిల్ లలో రిమూవబుల్ పోర్టబుల్ బ్యాటరీలు ఒక చార్జింగ్ పై 35 -100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. లైట్ స్పీడ్ మొబిలిటీ వెదురుతో తయారు చేసి సైకిళ్లను విక్రయించడం ఇదే మొదటిసారి. గతంలో కంపెనీ తయారు చేసిన అన్ని సైకిల్స్ అల్యూమినియం ఫ్రేమ్ లతో తయారు చేశారు. వెదురుతో తయారు చేసిన ఎలక్ట్రానిక్ సైకిల్ ఇదే మొదటిసారి.