భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొద్దిసేపటి క్రితం చాతి నొప్పితో కలకత్తాలోని వుడ్లాండ్స్ ఆస్పత్రిలో చేరారు. ఇక ఇది గుండెపోటు అయి ఉండొచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే గంగూలీకి ప్రాణాపాయం లేదని అయితే చాలా టెస్టులు చేయవలసిందిగా చెప్పారు. వుడ్ల్యాండ్ హాస్పిటల్ వారు చెప్పిన దాని ప్రకారం గంగూలికి ‘యాంజియోప్లాస్టి’ చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతానికైతే అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బుధవారమే కలకత్తాలో గంగూలీ ఈడెన్ గార్డెన్స్ ను ఇతర క్రికెట్ అధికారులతో సమీక్షించి అక్కడ త్వరలో జరగవలసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నిర్వహణపై కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ పనులు ఎంత వరకు వచ్చాయి అని సమీక్షించారు. అంతేకాకుండా ఈ మధ్యనే గంగూలీ రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలను కూడా తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతానికి అతని దృష్టి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడం పైనే ఉందని తెలియజేశారు.
శుక్రవారం ఉదయం వర్క్ అవుట్ అయిన తర్వాత అతను తన కుటుంబ సభ్యులతో ఛాతీ నొప్పి వస్తుందని చెప్పాడట. ఇక ఈ రోజు కూడా అలాగే చెప్పడంతో వెంటనే వారు అతనిని కలకత్తాలోని వుడ్లాండ్స్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. అయితే గంగూలీకి ప్రస్తుతం పెద్దగా అపాయం ఏమీ లేదని… ఇక రాబోయే గంటల్లో మరిన్ని వివరాలు అందిస్తామని ప్రస్తుతానికి ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.