ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఫోన్ వినియోగం ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఫోన్ లేనిదే పూట గడవదు. పూర్వకాలంలో తమ పనులను ఏ విధంగా చూసేవారు ప్రస్తుతం ఫోన్ ని కూడా తమ పని లాగానే చూస్తున్నారు. ఫోన్ అనేది తమ ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద జాయిన్ చేసుకుంటున్నారు.
ఇక ఫోన్ నీ వినియోగించేది పెద్దవారు మాత్రమే కాదు. రెండు సంవత్సరాల ఉన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఫోన్ ని వినియోగిస్తున్నారు. ఇక ఫోన్ వినియోగం వల్ల కొందరికి మేలు జరుగుతుంటే మరికొందరికి మాత్రం నష్టం జరుగుతుంది.
ఈ క్రమంలోనే ప్రభుత్వం అనేక రకాలుగా ఖండించినప్పటికీ వాటిని వినియోగదారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ ఫోన్ వినియోగించడం ఒక నెలరోజులు మానేస్తే ఎనిమిది లక్షలు ఇస్తానంటే ఎవరైనా వదులుకుంటారా. తాజాగా ఇదే రూల్ ని అనౌన్స్ చేసింది సిగ్గీస్. నెల రోజులపాటు మొబైల్ యూస్ చేయడం మానేస్తే ఎనిమిది లక్షలు మీ సొంతం.
అవును మీరు విన్నది నిజమే. యుఎస్ కి చెందిన సిగ్గీస్ అనే కంపెనీ ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఎవరైతే నెలరోజుల పాటు మొబైల్ లేకుండా గడుపుతారో వారికి పదివేల డాలర్లు అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 830000 ఇస్తాను అంటుంది. ఈ కంపెనీ చెప్పేదాన్ని ప్రకారం ప్రతి మనిషి ఒక రోజులో ఐదు గంటలు మొబైల్ ని యూస్ చేస్తాడు. అందుకే ఈ కంపెనీ ” digital detox ” ద్వారా మొబైల్ వాడకాన్ని అడ్డు కట్టడానికి ఈ ఛాలెంజ్ని ఇచ్చింది.