NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: పార్టీల పొత్తులతో చంద్రబాబు .. ప్రజాబలంతో మనం – వైఎస్ జగన్

YSRCP: పార్టీల పొత్తులతో చంద్రబాబు ఉంటే .. ప్రజాబలంతో మనం తలబడుతున్నామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించిన సీఎం వైఎస్ జగన్ సిద్దం అనే నినాదంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించి క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేస్తున్నారు. ఒకదానికి మించి మరొక సభలు విజయవంతం అయ్యాయి.

ఇవేళ బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో నిర్వహించిన సిద్దం సభ మూడు సభలకు మించి సూపర్ సక్సెస్ అయ్యింది. లక్షలాది మంది వైసీపీ కార్యకర్తలు సభకు హజరవ్వగా, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ సభలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ పై సెటైర్ లు వేశారు. చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలతో పాటు జేబులో మరో జాతీయ పార్టీ ఉందని, వీరంతా జగన్ ను ఓడించాలని చూస్తున్నారని, తాను మాత్రం పేదలను గెలిపించడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు.

చంద్రబాబుకు ఇతర పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్లు, అబద్దాలకు రంగులు పూసే ఎల్లో మీడియా ఉంటే తనకు మాత్రం లబ్దిదారులు, వారి కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారన్నారు. ప్యాకేజీలు ఇచ్చి కొనుకున్న ప్యాకేజీ స్టార్ తన పార్టీ వారి కోసం సీటు కావాలని అడగడనీ, చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. సైకిల్ తోయమంటే తోస్తాడు, కావాలంటే తాను తాగే టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సెటైర్ వేశారు. టీడీపీ మేనిఫెస్టోను కిచిడీ మానిఫెస్టోగా అభివర్ణించారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ వాగ్దానాలను చంద్రబాబు కాపీ కొట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడని విమర్శించారు.

2014లో ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత బుట్టదాఖలు చేసిన చంద్రబాబు  మరో సారి ప్రజలను మోసం చేసేందుకు మరో మేనిఫెస్టో తయారు చేస్తున్నారని విమర్శించారు జగన్. 2014లో ఇదే మూడు పార్టీలు కూటమిగా వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ను సీఎం జగన్ చదివి  వినిపించి ఇందులో హామీలు అమలు అయ్యాయా అని ప్రశ్నించారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని అన్నారు. చంద్రబాబు అండ్ కో పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు తప్ప సైన్యం లేదని అన్నారు. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని పార్టీ అటు వైపు ఉందని, వాళ్ల వెనుక ప్రజలు లేరు కాబట్టే పొత్తులతో ఎత్తులతో వస్తున్నారని విమర్శించారు.

ప్రజలను దోచుకునేందుకు.. పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకు అధికారం కావాలని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని సగర్వంగా చెబుతున్నామన్నారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్దం ఇది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని  ప్రజలకు వివరించి మరో సారి పార్టీ ఘన విజయం సాధించేలా క్యాడర్ పని చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ అంచనాలకు అనుగుణంగా లక్షలాది మంది సభకు హజరుకావడంతో పార్టీ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Australia: ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ దారుణ హత్య

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju