Samantha: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన నాగచైతన్య ,సమంత ని ఢీకొట్టే వారే లేరు. ఈ జంట కి ప్రస్తుత కాలంలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. వీరిద్దరూ విడిపోయి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఆరేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఒక్క సంవత్సర కాలం కూడా కలిసి ఉండకుండా విడిపోయారు.
దీంతో వీరి అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అనేక రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. కానీ వీటిపై సమంతా మాత్రం ఏమాత్రం స్పందించలేదు. అదేవిధంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు వారికి ఏ విషయంలో గొడవలు వచ్చాయి అనే విషయాన్ని కూడా తమ ఫ్యాన్స్ తో పంచుకోలేదు. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఒక సంవత్సరకాలం తన ట్రీట్మెంట్ కి కేటాయించింది.
ఇక ప్రస్తుతం రీయంట్రి ఇచ్చేందుకు సిద్ధమైంది సమంత. ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకి మాత్రం చాలా దగ్గరలో ఉంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ తమ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది సమంత. ” నా కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలుసు ఇది నిజంగా పెద్ద సాహసం అనే చెప్పాలి. కానీ నాకు తప్పలేదు.
అని తెలిసినా కూడా తప్పక చేయాల్సి వచ్చింది. ఆరోగ్యం కంటే ఏది గొప్పది కాదు కదా. అదే నేను అనుకున్న. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం విరామం ఇవ్వాల్సి వచ్చింది. నా అభిమానులకి నేను దూరంగా ఉండలేను కాబట్టి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్ లో ఉన్న ” అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది సమంత. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!