క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే దంపతుల ఆరోగ్యం సర్వకాలలు భేషుగ్గా ఉంటుందని సర్వేలు తెలియచేస్తున్నాయి. ఇవే కాకా తరుచూ శృంగారం లో పాల్గొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది . తాజాగా ఓ అధ్యయనంలో మరో ఆసక్తికర అంశం బయటపడింది. స్త్రీలు తరుచూ శృంగారం లో పాల్గొనడం వలన కిడ్నీలో రాళ్లు పోతాయి అని ఆ అధ్యయనం తెలియచేస్తుంది.
వారానికి మూడు లేదా నాలుగు సార్లు శృంగారంలో పాల్గొనే స్త్రీలు లు ఈ సమస్యను తేలికగా పరిష్కరించుకోగలుగుతారని తేలింది. శృంగార సమయం లో ప్రేమ పూరిత ఉద్వేగం కలిగినప్పుడు విడుదలయ్యే రసాయనాలు ముఖ్యమైన కండరాల సంకోచాన్ని పెంచడం వలన రాళ్లు బయటకుపోయే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియచేస్తున్నారు.
టర్కీలోని యూనివర్సిటీ జరిపిన ఈ పరిశోదన వివరాలను.. పబ్లిష్ చేశారు. ఈ అధ్యయనం లో భాగంగా కిడ్నీ లో రాళ్ల సమస్య తో బాధపడుతున్న మొత్తం 70 మంది స్త్రీలను ను ఎంపిక చేసారు. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు శృంగారం లో పాల్గొంటామని అందులో సగం మంది చెప్పారు. మిగతా వారు అలా చేయడం లేదని తెలిపారు. రెండు వారాలు జరిగిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించగా .. తరుచూ శృంగారం చేసేవారిలో 80 శాతం మందికి కిడ్నీలో రాళ్లు మూత్రం ద్వారా బయటకు వచ్చినట్టు తేలింది.
అలాగే తరుచూ శృంగారం చేయని వారిలో కేవలం 51 శాతం మంది మాత్రమే ఆ సమస్య నుంచి బయట పడినట్టు తెలిసింది. గతం లో జరిగిన అధ్యయానల్లో వారానికి మూడు నుంచి నాలుగు సార్లు శృంగారం లో పాల్గొనే మగవారు కూడా కిడ్నీలో రాళ్ల సమస్యను పరిష్కరించుకున్నట్టు తేలింది. ఇక, కిడ్నీ లో రాళ్లు ఏర్పడటం వల్ల విపరీతమైన నొప్పి పుడుతుంది. ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వడానికి కూడా దారితీస్తుంది.సరైనా సమయంలో చికిత్స జరగకపోతే కిడ్నీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది.