జగన్ కేబినెట్ లో 25.. జగన్ కాకుండా 25మంది మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో బీసీ వర్గానికి చెందిన మంత్రులు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరూ కూడా రాజ్యసభకు వెళుతున్నారు. వీరిద్దరు మండలి నుంచి ప్రాథినిత్యం వహిస్తుండడంతో… శుభాష్ చంద్రబోస్ యొక్క రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్ కి సంబందించిన శాఖ, మోపిదేవి వెంకట రమణకు సంబందించి ఆనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కి సంబందించిన శాఖ ఖాళీ కానున్నాయి. సాధారణంగా మత్స్యశాఖ బీసీలకే కేటాయిస్తుంటారు కాబట్టి… ఆ శాఖ కోసం బీసీ నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలో ఈ రెండు శాఖలతో పాటు మరో నాలుగు శాఖల్లో మార్పులు చేయాలా లేక… ఈ రెండింటితో పాటు మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాల అని జగన్ ఆలోచిస్తున్నారంట.
ప్రస్తుతం ఏపీలో ఈ మంత్రివర్గ కూర్పు గురించే తెగ చర్చలు నడుస్తున్నాయి. రాజ్యసభకు వెళ్తున్న ఇద్దరూ బీసీ వర్గానికి చెందినవారు కావడంతో ఆ రెండూ మళ్లీ బీసీలకే ఇస్తారని అంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… కొత్తగా కనీసం మరో ఇద్దరికైనా జగన్ తన కేబినెట్ లో చోటు కల్పించాలనుకుంటున్నారట. ఈ క్రమంలో కోస్తా ప్రాంతానికి చెందిన ఒక కీలక నేతను కేబినేట్ నుంచి తప్పించే అవకాశం ఉందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రచారం నిజం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇదే క్రమంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నేత మీద కూడా జగన్ కి సధాభిప్రాయం లేదని ఆయనను కూడా కేబినేట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి అని వినిపిస్తుంది. ఇదే క్రమంలో ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా కొత్తగా తన కేబినెట్ లోకి తీసుకోనున్నారని సమాచారం. అయితే ఆ అవకాశం జూనియర్ మహిళకు వస్తుందా.. సీనియర్ మహిళకు వస్తుందా అనేది వేచి చూడాలి! ఏది ఏమైనా.. ఈసారి మంత్రివర్గ కూర్పులో కీలక మార్పులే ఉండొచ్చని అంటున్నారు!