బంగారం కొనకున్నా కానీ దాని రేటు తగ్గింది అంటే మాత్రం మనసుకు తెలియని ప్రశాంత ఉంటుంది. ఇక కొనాలని అనుకునే వారి ఆశలకు హద్దులే ఉండవు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అచ్చం అలాగే కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధర తగ్గుతూనే వస్తోంది. ఈరోజు కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం డిలా పడిపోయింది.
పసిడి ధర తగ్గడం ఇది వరుసగా నాలుగో రోజు. ఇలా వరుసగా తగ్గడం చాలా అరుదు. ఈ విషయం పసిడి కొనుగోలు చేయాలని అనుకునే వారికి మంచి ఊరటను ఇచ్చే అంశం. బంగారం ఒక్కటే తగ్గడం కాకుండా వెండి ధర కూడా తగ్గుతోంది. బంగారం ధర కొద్దిగా తగ్గింది కానీ.. వెండి ధర మాత్రం భారీగా తగ్గుతోంది. ఇవి రెండు వరుసగా తగ్గడం ఎంతో మందికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం కొద్దగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.290 తగ్గి.. రూ.51,340వద్ద ఆగింది. అట్టాగే.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి కూడా రూ.300 తగ్గి.. రూ.47,000వద్దన నిలిచింది.పసిడి ధర తగ్గడంతో వెండి కూడా ఇదే బాటలో నడిచింది. రూ.1,600 తగ్గిన వెండి రూ.66,700 వద్ద ఆగింది.
ఈ తగ్గుదలకు ప్రధాన కారణం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడమేనని పలువురు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కూడా పసిడి ధర తగ్గింది. ఔన్స్కు 0.02 శాతం తగ్గి.. 1864 డాలర్లకు చేరింది. అతర్జాతీయంగా పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ఔన్స్కు 0.10 శాతం పెరిగి 24.12 డాలర్లకు చేరింది.
బంగారం ధరపై తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రదానంగా ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్లల్లో బంగారం ధరల్లో వచ్చే మార్పు, కేంద్ర బ్యాంకుల్లో ఉండే పసిడి నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ తదితర అంశాలను బట్టి బంగారం రేటు మారుతూ ఉంటుందని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు.