ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం Tesla.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన, టెస్లా అధినేత ఎలోన్ మాస్క్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు..! తాజాగా టెస్లా ఇండియాలో ఒక సబ్సిడరీ కంపెనీ కోసం రిజిస్టర్ చేసుకుంది..! ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా బెంగళూరులో నమోదయిన సంగతి అందరికీ తెలిసిందే.. ఆటో పైలెట్ ఫీచర్ కారు వేగంగా వెళ్తుండగా అందులోని డ్రైవర్ ,ప్యాసింజర్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఇలా నిద్రపోవడం పై నెటిజన్లు వివిధ కామెంట్లు చేశారు..
టెస్లా తయారుచేసిన కార్లలో ఆటో ఫైలైట్ ఫీచర్ ఎంతో ప్రత్యేకమైనది.. ఈ ఫీచర్ బాగా హైప్ తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ వల్ల రోడ్లపై కారు అదే సొంతంగా డ్రైవ్ చేసుకుంటుంది.. డ్రైవర్ ఉండాల్సిన అవసరం లేదు.. ఈ ఫీచర్ ను ఉపయోగించుకుని ఓ tesla కారులో డ్రైవర్, ప్యాసింజర్ నిద్రపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ వీడియో చూస్తూంటే కారులో ఉన్న వారు కంఫర్ట్ గానే ఉన్నా ఈ వీడియో చూసిన వారు మాత్రం కాస్త భయానికి గురి అయ్యారు. టెస్లా ఆటో పైలెట్ ఫీచర్ కాకుండా అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ ను పాటించడం , లేన్ సెంటరింగ్, సెల్ఫ్ పార్కింగ్, ఆటోమేటిక్ లేన్ చేంజింగ్, సెమీ ఆటో నమస్ నావిగేషన్ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అయినప్పటికీ కారు బాధ్యత డ్రైవర్ తీసుకోవాలి.
టెస్లా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా కంపెనీ కార్యాలయం బెంగళూరు క్లబ్ నందు ఏర్పాటు కానుంది. ఇందులో టెస్లా సేల్స్ తో పాటు అసెంబ్లింగ్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ చేయనుంది. tesla ప్రపంచవ్యాప్తంగా అత్యంత మక్కువ చూపించే బ్రాండ్లలో ఇది ఒకటి. ఇండియాలో టెస్లా అనుబంధ సంస్థ ఏర్పడడం భారత దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు చాలా అవసరం. భారతదేశంలో ఈ ఫీచర్స్ ఉన్న కారు రానుందేమో వేచిచూడాలి.
https://twitter.com/knowIedgehub/status/1350375646803890176?s=20