భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఇంకా పూర్తిగా చల్లారలేదు. గాల్వన్ వ్యాలీ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయిన చైనా ఆర్మీ.. డెప్సాంగ్, పంగ్యంగ్త్యా ప్రాంతాలను ఇంకా ఖాళీ చేయలేదు. భారత్ కు అన్ని రకాలుగా అత్యంత అనుకూలమైన ఈ ప్రాంతాలు ఎంతో సున్నితమైనవి. ఈ ప్రాంతంలో చైనా ఖాళీ చేసేందుకు ఆమధ్య కమాండర్ స్థాయిలో జరిగిన సమావేశాలు ఫలించలేదు. దీనిపై మరోసారి చర్చలు జరుగనున్నాయి.
వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇక్కడ తీసుకోబోయే చర్యల కోసం భారత వైమానికదళ అధికారులు, కమాండర్లు ఈ నెల 22న రెండు రోజులపాటు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వైమానికదళ అధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏడుగురు కమాండర్ ఇన్ చీఫ్ అధికారులతో పాటు చైనా సరహిద్దు రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వైమానికదళ అధికారులు డా హాజరు కానున్నారు.
వాస్తవాధీన రేఖ వెంబడి అత్యాధునికమైన ర్యాపిడ్ రాఫెల్ యుద్ధ విమానాలను మొహరించాలనే అంశంపై ఈ సమావేశం జరుగనుంది. రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ అందించనుంది. షెడ్యూల్ ప్రకారం మరో రెండు నెలల తర్వాత భారత్ కు అందించాల్సి ఉంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే వాటిని రప్పించుకుంటోంది భారత్. ఈ నెలాఖరులోగా మరికొన్ని యుద్ధ విమానాలు భారత్ వైమానికదళ అమ్ములపొదిలో చేరనున్నాయి. వీటినే వాస్తవాధీన రేఖ వెంబడి మొహరించాలని భావిస్తోంది కేంద్రం.