India – Singapore : ప్రయాణ ప్రియులు వెళ్లే లిస్టులో తప్పక ఈ ప్రదేశం ఉంటుంది..సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి విమానాలలో ప్రయాణించాలని సంగతి అందరికీ తెలిసిందే.. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బస్సు ద్వారా ప్రయాణం అంటే వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇదీ నిజమేనండి.. భారతదేశం నుంచి సమీప దేశమైన సింగపూర్ కి బస్ సర్వీస్ ప్రారంభం కానుంది.. మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హర్యానాలోని గురుగావ్ లో ఉన్న అడ్వెంచరస్ ఓవర్ల్యాండ్ ఒక ప్రైవేటు ట్రావెల్స్ భారతదేశం నుండి సింగపూర్ వెళ్లే బస్సు సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ బస్సు మూడు దేశాలనుండి వెళుతుంది ఈ ప్రకటన ద్వారా సుదూర ప్రయాణ ప్రియులు హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండా దీనికి మంచి స్పందన కూడా లభించింది. ఈ బస్సు సర్వీస్ నవంబర్ 14న మణిపూర్లోని ఇంపాల్ నుండి ప్రారంభమవుతుంది. అడ్వెంచర్ ఓవర్ల్యాండ్ ప్రస్తుతం ట్రావెల్ టికెట్ల బుకింగ్స్ తెరిచినట్లు తెలిపింది. త్వరగా బుక్ చేసుకున్న వారికి మొదటి దశలో వెళ్లే అవకాశం ఉంది.
సింగపూర్ లోకి ప్రవేశించే ముందు ఈ బస్సు మయన్మార్, థాయిలాండ్ , మలేషియా మీదుగా వెళ్తుంది . మయన్మార్ లోని కాలే, బ్యాంకాక్, థాయిలాండ్ లోని కాబ్రీ, మలేషియాలోని కౌలాలంపూర్ సందర్శించవలసిన ముఖ్యమైన నగరాల ద్వారా వెళుతుంది. ఈ బస్సు సర్వీసు భారతదేశం నుండి సింగపూర్ దశల వారీగా తీసుకెళుతుంది. ప్రతి దశలో 20 సీట్లు మాత్రమే పరిమితం చేశారు . 20 రోజులు ప్రయాణం ఉంటుంది. ఈ బస్సు 5 గుండా ప్రయాణిస్తుంది. ఇందులో ప్రయాణించే ప్రయాణికులు రోడ్డు మార్గంలో సుమారు 4,500 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు. ఈ దూరాన్ని కొన్ని గంటల్లో విమానంలో ప్రయాణించే కలిగినప్పటికీ రహదారి ప్రయాణం ప్రయాణికులకు విభిన్నమైన అనుభూతిని అందిస్తుందని adventurous over land తెలిపింది. ప్రకృతి ప్రేమికులు ఆహ్లాద కరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి ప్రయాణాలలో ఒకటిగా నిలుస్తుంది .