Sonu Sood : పేదల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సోనూసూద్ ..!!
Sonu Sood :లాక్ డౌన్ సమయం లో ఆ తర్వాత దేశంలో ఏ హీరో చేయని విధంగా వలస కార్మికులకు నిరుపేదలకు సహాయం చేస్తున్నాడు నటుడు సోనూసూద్. ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలు పెంచడంతోపాటు పేద పిల్లలకు స్కాలర్షిప్ పులు అందిస్తూ చదివిస్తూ ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో అంబులెన్స్ సర్వీసులు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అనేక అతిథులుగా సోనుసూద్ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో దేశంలో ఉన్న నిరుపేదల కోసం వారి చదువు కోసం సోనుసూద్ సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం చాలా వరకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న క్రమంలో .. నిరుపేదలు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు ఇవ్వలేని పరిస్థితిలో ఉండటంతో అటువంటి కుటుంబాలకు చేయూత ఇవ్వటానికి సోను సూద్ ప్రముఖ దిగ్గజ కంపెనీ ఏంఐతో సరికొత్త ఆలోచన చేశారు. దేశవ్యాప్తంగా ఉండే వాళ్లు నిరుపేదల చదువుకు ఉపయోగపడాలని అనుకునే వాళ్లు తమ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలనుకునే వాళ్ళు http://shikshaharhaath.com/ ని సందర్శించి తమ ఫోన్లను విరాళంగా ఇవ్వవచ్చు అని పేదవాళ్లకు ఉపయోగపడవచ్చు అని సోను సూద్ బృందం తెలిపింది. అంతేకాకుండా ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్లు మరింత శక్తివంతంగా పనిచేయడానికి ఏంఐ సర్వీస్ సెంటర్లో పునరుద్ధరించబడాతయి. ఇదే విషయాన్ని కంపెనీ ఎండి కుమార్ జైన్ కూడా తెలిపారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం మా కంపెనీ శక్తిమేరకు పని చేస్తుందని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని సోనూసూద్ తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకున్నారు.