అనంతపురం ప్రాంతంలో జెసి సోదరుల పవర్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సంవత్సరాలుగా ఏకచ్ఛత్రాధిపత్యంగా తాడిపత్రి నియోజకవర్గ ప్రాంతంతో పాటు అనంతపురం జిల్లా మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న జెసి దివాకర్ రెడ్డి మరియు అతని తమ్ముడు ప్రభాకర్ రెడ్డిల హవాకు 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి స్వస్తి పలికారు. అయితే ఆ తర్వాత కూడా వారిలో ఉన్న వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తూ అధికార పార్టీ నేతలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
ఇక ఈ మధ్యనే ట్రావెల్ బస్సుల అవకతవకల విషయంలో పక్కా ఆధారాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అతని కొడుకు అశ్మిత్ రెడ్డి లను సీబీఐ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా దివాకర్ రెడ్డి సైలెంట్ గా లేదు. ఇక కస్టడీలో ఉన్న ప్రభాకర్ రెడ్డి కూడా ఈ బస్సుల వ్యవహారం వల్ల తనకు జరిగిన నష్టం ఏమీ లేదని ఈ కరోనా సమయంలోనే తమ బస్సులన్నీ అమ్మేశామని…. త్వరలోనే బయటికి వచ్చి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ప్రభకర్ రెడ్దితో పాటు అతని కొడుకు అస్మిత్ రెడ్డిలకు కూడా బెయిల్ మంజూరు కాకపోవడంతో వరుసగా విచారణకు హాజరు అవుతూ తెల్లమొహం వేశాడు. ఈ దెబ్బ తాడిపత్రి లో ఉన్న అన్న దివాకర్ రెడ్డికి తగిలింది. దీంతో ఒక్కసారిగా దిగులు పడిపోయిన దివాకర్ రెడ్డిని పరామర్శించేందుకు ఈ మధ్యనే లోకేష్ కూడా వెళ్ళాడు. తాజాగా ఒక డైనింగ్ టేబుల్ ఫోటో కూడా దీనికి సంబంధించి వైరల్ అయింది. అయితే ప్రతి చోట ఇప్పుడు దివాకర్ రెడ్డి… తన జీవితంలో ఏ రోజూ లేని విధంగా తెల్ల ముఖం వేసుకొని కూర్చోవడం చూసి అనంతపురం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి దివాకర్ రెడ్డి ఈ పరిస్థితి నుండి బయటకు వచ్చేది ఎప్పుడు?