Kuwait : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ వల్ల చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కువైట్ Kuwait దేశం కూడా భారీగా నష్టపోయింది. చైనా దేశంలో బయటపడ్డ ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలో అన్ని దేశాలలో వ్యాప్తి చెంది ఆర్థికంగా నష్టం చేకూర్చడమే కాక చాలామందిని బలి తీసుకోవడం జరిగింది. ఈ వైరస్ బయట ప్రపంచానికి రావటానికి అసలు మూల కారణం ఏంటి అన్న దాని విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు. ఇదిలా ఉంటే మరో పక్క ఈ వైరస్ కి సంబంధించి విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గాని మరికొన్నికొత్త వైరస్ లు పుట్టుకురావడం జనాలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంది.
ఇదిలా ఉంటే కొన్ని దేశాలలో మహమ్మారి ఉదృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అటువంటి దేశాలలో ఒకటి కువైట్. గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది పెరిగిపోతుండటంతో.. ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా ఉద్రిక్తత దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూ వారం రోజుల పాటు అంతర్జాతీయ పర్యాటకుల పై నిషేధం విధించింది. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కరోనా నిబంధనలు ఎవరైనా అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే వారి జీతాన్ని కట్ చేయాలని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి జీతంలోనుంచి గరిష్టంగా 15 రోజుల జీతాన్ని కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.