ఈజనరేషన్ లో టెక్నాలజీ ఎక్కువవుతున్న కొద్దీ సైబర్ క్రైమ్స్ ఎక్కువవుతున్నాయి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును అకౌంట్లలో నుంచి దోచేస్తున్నారు. అంతవరకే కాదు.. ఇప్పుడు యూట్యూబ్ చానెళ్లను కూడా హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
అలా.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లాస్య యూట్యూబ్ చానెల్ లాస్య టాక్స్ కూడా అలాగే హ్యాక్ అయింది. తనకు 8 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వీడియోలు చాలానే ఉన్నాయి. యాడ్ రెవెన్యూ కూడా బాగానే ఉంది. కానీ.. ఎందుకో సైబర్ నేరగాళ్ల కన్ను ఈమె మీద పడింది. అంతే.. లాస్య టాక్స్ చానెల్ ను హాక్ చేశారు. అయితే.. నెటిజన్లు, తన సబ్ స్క్రైబర్లు చెప్పేంతవరకు కూడా లాస్యకు ఈ విషయం తెలియలేదట.
చాలామంది నెటిజన్లు యూట్యూబ్ లో లాస్య టాక్స్ చానెల్ కనిపించకపోయేసరికి.. లాస్యకు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు పెట్టారట. దీంతో అప్పుడు తెలిసిందట.. లాస్య టాక్స్ చానెల్ హ్యాక్ అయిందని.
వెంటనే ఎథికల్ హ్యాకర్స్ రంగంలోకి దిగి.. హ్యాక్ అయిన 48 గంటల్లో లాస్య టాక్స్ యూట్యూబ్ చానెల్ ను తిరిగి వెనక్కి తీసుకొచ్చేశారు. దీంతో వెంటనే లైవ్ లోకి వచ్చిన లాస్య.. తన చానెల్ ను మళ్లీ వెనక్కి తీసుకొచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపింది.
చానెల్ బ్యాక్ రావడంతో.. మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ మీ ముందుకు వస్తానంటూ తన సబ్ స్క్రైబర్లకు చెప్పింది.