safe mode: ఉదయాన్నే నిద్ర మత్తునుండి కళ్ళు తెరుస్తూనే ముందు ఫోన్ తీసుకుని చెక్ చేసుకుంటారు చాలామంది. 80 శాతం మందికి లేచిన 15 ని.ల లోపు ఫోన్ లో అప్ డేట్స్ చెక్ చేసుకోకపోతే ఏమి తోచదు. ఇలా చేయడం వలన శారీరకం గా మానసిక గా దుష్ప్రభావాలు తప్పవు అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఆ రకం గా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
ఉదయం లేచిన వెంటనే డేటా , కానీ వైఫై ఆన్ చేయగానే.. మెసేజ్ ల రూపం లో ఎంతో సమాచారం ఒక్కసారిగా ఫోన్ నిండిపోతుంది. అలా వచ్చిన సమాచారం మీ మనసును ఉద్రేక పరుస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల అందులోని వచ్చిన ఇమెయిల్ ,మెసేజ్స్ వలన మీ మూడ్ పాడయి రోజంతా అలాగే గడిచే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడితో, కంగారుతో రోజు ప్రారంభమవుతుంది. లేవగానే నిద్ర కళ్ళతో ఫోన్ చెక్ చేయడం వల్ల కంటి పై చెడు ప్రభావం పడి, కంటి చూపును పాడుచేస్తుంది. అంతేకాదు క్యాన్సర్ కు కూడా కారణం అవుతుంది అని తెలియ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లను గంటల తరబడి వాడటం వలన ఊబకాయం, మెడ దృఢత్వం తగ్గిపోవడం, నొప్పి, నిద్ర లేమి, క్యాన్సర్, విద్యుదయస్కాంత వికిరణం, మెదడులో మార్పులు వంటి సమస్యలకు గురవుతున్నారు . ఉదయం లేవగానే ఫోన్ వాడకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించి చూడండి. ఉదయం లేవగానే వెంటనే ఫోన్ చూడకండి. మెలకువ రాగానే రెండు అర చేతులు రుద్దుకుని కళ్ళ మీద పెట్టుకుని.. కళ్ళు తెరిచి అరచేతులను చూడండి. దీని వలన కంటి చూపు మెరుగవుతుంది.
ఫోన్ ఉదయాన్నే లేవడానికి ఫోన్ లో అలారం పెట్టుకోకుండా.. అలారం క్లాక్ కొనుక్కుని అందులో పెట్టండి.దీంతో లేవగానే ఫోన్ చూడడాన్ని ఆపవచ్చు. లేవగానే ఫోన్ మీదకి దృష్టి మళ్లకుండా వాకింగ్ ,వ్యాయామం, గార్డెనింగ్ ,ధ్యానం లాంటి పనులు పెట్టుకుని ఆరోగ్యవంతమైన దినచర్యగా మార్చుకోండి. మీ ఉదయాన్నీ చాలా సేపు ప్రశాంతం గా గడిపిన తర్వాత … మాత్రమే ఫోన్ చూడాలి అని గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇది చేయడానికి చాలా సమయం పట్టవచ్చు, ప్రయత్నం మాత్రం చేయడం మానవద్దు.