నిన్ననే ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోమని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ఇప్పుడు ఏ కోర్స్ ను అయితే ఎంచుకుంటామో ఆవైపుగానే మన భవిష్యత్తు ఉంటుంది. ఉదాహరణకు మనం ఇప్పుడు ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరుగా, బైపీసీ తీసుకుంటే డాక్టర్ గా, ఇవేమీ కాకుండా ఒకేషనల్ కోర్స్ లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా సొంతం గా ఏదైనా వృత్తి ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇంటర్ పూర్తైన వెంటనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తరవాత ఏ కోర్స్ లో జాయిన్ చేయించాలి. ఇంటర్ తరవాత వేసే అడుగు అతిముఖ్యమైంది . అది చదువు, ఉద్యోగం ఏదైనా సరే. వారి ప్రణాళికను ఎలా తయారు చేయవచ్చో చూద్దాం.
సాధారణంగా అందరు ఎంపీసీ, బైపీసీ నే ఎంచుకుంటున్నారు. మారుతున్న కాలంతో మనం కూడా మారాలంటే కొత్త కొత్త వాటివైపు వెళ్ళాలి. అగ్రికల్చర్, ఫుడ్& టెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫ్యాషన్ టెక్నాలజీ. విదేశీ విద్యను అభ్యసించాలనుకునేవారు ఇప్పటి నుంచే ఆ దిశాగా ప్రణాళికలు చేసుకోవాలి. ఏదైనా సొంతంగా బిజినెస్ చేయాలి అనుకునే వారు ఫుడ్& టెక్నాలజీ, మీకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు.ఇంటర్ అయినా వెంటనే వివిధ కోర్సులు ఉన్నాయి . అవి ఇంజినీరింగ్, మెడిసిన్ , ఫిజియోథెరపీ, ఫ్యాషన్ టెక్నాలజీ, కామర్స్, ఆధునిక కోర్సులు, వ్యవసాయ కోర్సులు, న్యాయవిద్య, ఉపాధ్యాయ వృత్తి, విదేశీ భాషలతో…ఉద్యోగావకాశాలు. ఫైన్ఆర్ట్స్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, పాదరక్షల తయారీ, , హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, బీఎస్సీ హార్టికల్చర్, ఫార్మసీ కోర్సులు, బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ .వీటిల్లో వారికీ నచ్చిన ఏ కోర్స్ లో అయినా జాయిన్ అయ్యి వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా అడుగులు వెయ్యాలని ఆశిద్దాము.