Miss India : మన తెలంగాణ కు చెందిన తెలుగు అమ్మాయి.. యువ ఇంజనీరు మానస వారణాసి manasa Varanasi .. బుధవారం రాత్రి ముంబై లో జరిగిన వీ ఎల్ సీ సీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచింది..!! మానస పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.. ఆమె వయస్సు 23 సంవత్సరాలు.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన మానసా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనలిస్ట్ గా పనిచేస్తోంది.. మానస వ్యాపకాలు యోగా చేయడం, పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం.. భరతనాట్యం సంగీతంలో కూడా మనకు అనుభవం ఉంది.. మానసా చిన్నప్పటినుంచి సైలెంట్ గా ఉంటుంది.. డిసెంబర్ 2021 లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొననుంది..
హరియాణా యువతి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా వరల్డ్ 2020 గా, ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్యా సింగ్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 రన్నరప్ గా నిలిచారు.. ఈ జ్యూరీ సభ్యులు గా బాలీవుడ్ నటులు నేహ ధూపియా, చిత్రాంగద సింగ్, పులకిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించారు.