MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన కవిత ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హజరుపర్చగా, ఏడు రోజుల పాటు కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది.
కాగా, ఇవేళ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు దిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది ఇవేళ ఆన్ లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై ఏం జరగనుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత తరపున దాఖలైన కంటెంప్ట్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. కాగా, ఈడీ కార్యాలయంలో కవితను రెండో రోజు సోమవారం అధికారులు విచారిస్తున్నారు. నిన్న కవిత విచారణను ఈడీ అధికారులు కోర్టు ఉత్తర్వుల మేరకు వీడియో రికార్డింగ్ చేశారు.
విచారణ తర్వాత కవితను కేటిఆర్, హరీష్, భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు తదితరులు కలిసి మాట్లాడారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (మాజీ సీఎం కేసిఆర్ కుమార్తె) ను ఈడీ అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా .. ఎందుకంటే..?