దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చైనా నుండి కరోనా వైరస్ బయట ప్రపంచంలో ఎంటర్ అయినా టైం లో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడేవి అతలాకుతలం అయిపోయాయి. అలాంటి సమయంలో చైనా పక్కనే ఉన్న ఇండియా మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొని లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసింది. కాగా అప్పటిదాకా అంతా బాగానే ఉన్నా గాని లాక్ డౌన్ అనంతరం కేంద్రం పూర్తిగా చేతులు ఎతేసినట్లు పరిస్థితి మారింది. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి చూస్తే చాల డెంజరస్ గా మారింది. ప్రపంచంలోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశంగా ఇండియా మూడో స్థానంలో ఉంది. దేశంలో కరోనా వైరస్ సెలబ్రిటీలన్ని మొదలు పేదవాన్ని వరకు ఎవరిని విడిచి పెట్టడం లేదు.
ఇదిలా ఉండగా అమితాబ్ బచ్చన్ …. ఐశ్వర్యారాయ్ మరియు అభిషేక్ బచ్చన్ వారి కూతురు ఆరాధ్య ఇటీవల కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడటంతో ఈ విషయం దేశంలోనే పెద్ద హాట్ టాపిక్ అయింది. మొదటిలో హోమ్ క్వారైంటెన్ లో ఉన్న తరువాత హాస్పిటల్ కు వెళ్లటం జరిగింది. అయితే తాజాగా జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షలలో తల్లి కూతురు ఇద్దరికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.
దీంతో ఐశ్వర్య రాయి అలాగే కూతురు ఆరాధ్య సోమవారం ముంబై నానావతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసాడు. “మీ నిరంతర ప్రార్థనలు మరియు శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్య ఆరాధ్యలకు నెగెటివ్ గా పరీక్షల్లో తేలడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. వారు ఇప్పుడు ఇంట్లో ఉంటారు. నా తండ్రి అమితాబ్ నేను వైద్య సిబ్బంది సంరక్షణలో ఆసుపత్రిలోనే ఉన్నాము ”అని అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!