మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ హీరోగా ఉప్పెన అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలోని కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే ఫుల్లు వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఆ పాటే. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు ఈ సినిమాకు డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇక.. ఈ సినిమా షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిపోయింది. కానీ.. కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరిగిపోవడం, నాని వీ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుండటంతో.. చాలామంది హీరోలు, నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో అయినా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కూడా ఓటీటీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయట. కానీ.. మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయడానికే ఆసక్తి చూపిస్తోందట.
నిజానికి ఈ సినిమాకు ఖర్చు పాతిక కోట్లు అయిందట. పాతిక కోట్లు పెట్టి సినిమా తీసి.. ఓటీటీలో రిలీజ్ చేస్తే ప్రొడ్యూసర్ కు మిగిలేది ఏం ఉండదు. ఓటీటీల నుంచి పాతిక కోట్లు రావడం అంటే చాలా కష్టం.
అమెజాన్ ప్రైమ్ నుంచి ఉప్పెన కోసం 13 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందట. 13 కోట్లు అంటే సినిమా బడ్జెట్ లో అది కేవలం సగం మాత్రమే. ఒకవేళ అమెజాన్ ప్రైమ్ కు ఆ సినిమాను ఇచ్చేస్తే ప్రొడ్యూసర్ కు గ్రేట్ లాసే కదా.
అది కూడా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఆమాత్రం ఆఫర్ చేసిందట. లేదంటే కొత్త హీరో సినిమాకు అంత పెట్టి కొనే సీన్ లేదు అంటూ ఫిలింనగర్ టాక్.
ఏది ఏమైనా.. ఒకవేళ ఓటీటీకి ఉప్పెనను ఇచ్చేస్తే ఓ 13 కోట్లు, శాటిలైట్ రైట్స్ కు ఓ ఏడు ఎనిమిది కోట్లు వచ్చినా.. ఫైనల్ గా సినిమాకు 5 నుంచి 6 కోట్ల దాకా లాస్ మాత్రం ఖచ్చితం అని తెలుస్తోంది.
అంత లాస్ ను ప్రొడ్యూసర్ భరించాలంటే కష్టమే. అందుకే.. థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు వేచి చూద్దామని మూవీ యూనిట్ కూడా ఆలోచిస్తోందట. ఒకవేళ థియేటర్స్ త్వరగా తెరుచుకోకపోతే మూవీ యూనిట్ ఏం చేస్తుందో చూడాలి మరి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!