Cybercrime: రోజు రోజుకి సైబర్ నేరగాళ్లు Cybercrime కొత్త కొత్త పద్దతులలో ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో ఒకరి ఫేస్ బుక్ అకౌంట్ ని హ్యాక్ చేసి అందులోని ఫ్రెండ్స్ కు అత్యవసరంగా డబ్బులు అవసరమని పంపించమని మెసేజీ లు పంపిన ఉదాంతాలు మనకి తెలిసిందే. తాజగా ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకొక కొత్త రకం మోసానికి ఒడిగడుతున్నారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చాడు ఓ వ్యక్తి.అతడు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వర్క్ ఫ్రొం హోమ్ చేసుకుంటున్న అతడికి ఓ రోజు సడన్ గా ఒక నెంబర్ నుంచి నాకు అర్జెంటు గా రూ.1.5 లక్షలు పంపమని అలాగే పది రోజులలో తిరిగి ఇచ్చేస్తా అని మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చుసిన ఆ వ్యక్తి డీపీ చూస్తే అతడికి బాగా తెలిసిన స్నేహితురాలు. ఎప్పుడు ఏ సహాయం అడగని అమ్మాయి ఇప్పుడు అడిగింది అని నిజం అనుకుని నమ్మి రూ.1.5 లక్షలు పంపించాడు. ఆ మరుసటి రోజు అసలు ఆ అమ్మాయికి ఎం అయ్యిందో అని ఫోన్ చేసి అడగగా ఆమె చెప్పిన విషయానికి షాక్ అయ్యాడు.
అసలు నేను నిన్ను డబ్బులు ఎందుకు అడుగుతాను? ఎవరో నిన్ను మోసం చేసారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీనితో మోసపోయా అని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించి జరిగినదంతా వివరించాడు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఇటువంటి ఫిర్యాదులు ఇంకొక రెండు నమోదయ్యాయట. ఒకరు రూ.27వేలు మరొకరిది రూ.33 వేల కేసులు. కాబట్టి ఇటు వంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండమని పోలీసులు సలహా ఇస్తున్నారు.