భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడప్పుడు వ్యక్తిత్వ నిపుణుడిలా మాట్లాడుతారు. నిత్యం ప్రవచనాలు బోధిస్తూ…. సామాజిక విలువలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి మోడీ తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్సిసి క్యాడెట్ రిపబ్లిక్ డే రిహార్సిల్ కార్యక్రమంలో యువతకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.
ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే రిహార్సిల్స్ కార్యక్రమంలో ఎన్సిసి క్యాండెట్ నిర్వహించిన అద్భుతమైన విన్యాసాలను తిలకించిన మోడీ ఆ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం చేశారు. తాజాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది అన్న విషయం తెలిసిందే, అయితే ఈ సందర్భంగా దీనిపై ఎన్నో అనుమానాలు, అపోహలు చోటుచేసుకుంటున్నాయి.
ఇక ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి సోషల్ మీడియా లో వచ్చే అసత్యాలకు చరమగీతం పాడాలని తెలిపారు. మీడియాలో వచ్చే వార్తలకు భిన్నంగా సోషల్ మీడియా పోస్టులు ఉంటున్నాయని…. వ్యాక్సిన్పై అనవసరమైన సందేహాలను, భయాలను వీరు కలుగజేస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ వ్యాక్సినేషన్ పైన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి.
కోవిడ్ వ్యాక్సిన్ పైన దేశ ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ పై దాడులను తిప్పి కొట్టేందుకు దేశ యువత నడుం బిగించాలని చెప్పిన మోడీ ప్రతి గ్రామంలో యువత ప్రజలకు టీకా పైన పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. పేదల పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పిన దేశ ప్రధాని వ్యాక్సిన్ గూర్చి వచ్చే ఏ రకమైన తప్పుడు సమాచారాన్ని కూడా యువత నమ్మవద్దని తెలిపారు. కరోనా పై పోరు లో ప్రస్తుతం భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పిన ఆయన యువత కష్టపడితేనే భారత దేశం అన్ని రంగాల్లో స్వయం సంపత్తి సాధిస్తుందని చెప్పారు.