Nimmagadda Ramesh Kumar : నిన్న మొన్నటి వరకు రాయలసీమ ప్రాంతం లో పర్యటించిన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ Nimmagadda Ramesh Kumar తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం జిల్లా కలెక్టర్లతో అదేవిధంగా ఉన్నత అధికారులతో సమావేశం అవుతూనే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లు పారదర్శకంగా ఉండాలని భద్రతా కట్టుదిట్టంగా ఉండాలని సూచనలు ఇవ్వటమే కాక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ దృష్టికి తీసుకువచ్చారు టిడిపి పార్టీ నేతలు వర్ల రామయ్య ఎమ్మెల్యే అశోక్ బాబు. ఈ క్రమంలో వైసిపి పార్టీ పై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికార పార్టీ ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిమ్మాడలో వైసిపి నేతల చర్యలపై పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాతావరణంలో ఎన్నికలు అలా సజావుగా సాగుతాయని ప్రశ్నించారు. అంతేకాక అచ్చెన్నాయుడు ని విమర్శించడంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా సిఐ, డిఎస్పి ని సస్పెండ్ చేయాలి అని కోరారు. పలు గ్రామాలలో బలవంతమైన ఏకగ్రీవాలు జరిగాయని అలాంటి చోటా కేంద్ర బలగాలు మోహరింపు చేయాలని, ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ దృష్టికి టిడిపి నేతలు తీసుకొచ్చారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ టిడిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది సస్పెన్స్ గా మారింది.