ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కరోనా వైరస్ ప్రారంభంలో ఎవరికైనా దేశంలో కరోనా వైరస్ సోకితే నిర్మొహమాటంగా కాల్చేస్తా అని ఆదేశాలు ఇవ్వడం అప్పట్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా స్వతహాగా చైన్ స్మోకర్ గా పేరొందిన కిమ్ జాంగ్ చాలావరకు అధికార కార్యక్రమాలలో ఎక్కడపడితే అక్కడ స్మోకింగ్ చేస్తూ దర్శనమిచ్చే వాళ్ళు.
అయితే ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఉత్తర కొరియా లో ఎక్కువమంది ధూమపానం చేస్తారని నివేదికలు బయటపెట్టడంతో కిమ్ జాంగ్ ఒక్కసారిగా తన దేశ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ కలిగింది. గతంలో ఉత్తరకొరియా పొగరాయుళ్లు లకు స్వేచ్ఛ నిస్తూ ఎక్కడపడితే అక్కడ సిగరెట్ కాల్చుకునే స్వాతంత్రం ఉండేది. కానీ తాజాగా కిమ్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ధూమపానాన్ని నిషేధించడం జరిగింది.
దీనిపై ఉత్తరకొరియా పీపుల్స్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించినటు అక్కడ అధికార మీడియా ప్రకటించింది. దేశంలో స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, మల్స్, వైద్య ప్రజా ఆరోగ్య కేంద్రాలలో బహిరంగా స్మోకింగ్ పై నిషేధం విధిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో బహిరంగంగా స్మోకింగ్ చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారు అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.