అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు 2 ఫ్లాప్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో చిన్న గ్యాప్ వచిన సంగతి తెలిసిందే. ఈ చిన్న గ్యాప్ కే ఇక టాలీవుడ్ లో రకుల్ కెరీర్ క్లోజ్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు. కాని ఇప్పుడు వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకుటూ షాకులిస్తోంది. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా కంప్లీట్ చేసిందని అంటున్నారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా వికారాబాద్ లో టాకీ పార్ట్ మొత్తాన్ని ఒకే షెడ్యూల్ లో సినిమాని కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా నటిస్తుంది రకుల్.
అలాగే యంగ్ హీరో నితిన్ నటించబోతున్న సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ అన్న సినిమాని ఇటీవలే ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ లుక్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్ కూడా నటిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్ తో పాటు తాజాగా మేఘా ఆకాష్ ని ఎంచుకున్నట్టు సమాచారం.
ఇక ఇప్పటికే శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2 లో కూడా రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రెండు బాలీవుడ్ సినిమాలు చేతిలో ఉన్నాయి. కాగా తాజాగా టాలీవుడ్ లో అక్కినేని నాగ చైతన్య – మనం ఫేం విక్రం కె కుమార్ కాంబినేషన్ లో రూపొందనున్న థ్యాంక్యూ అన్న సినిమాలో రకుల్ ప్రీత్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుదట. ఇక గతంలో నాగ చైతన్య – రకుల్ కలిసి రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించారు.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!