మరొకసారి ఆంధ్ర రాష్ట్రం విస్తుపోయింది. ఒక దళితుడిపై జరిగిన మరో అమానుష చర్యకు ప్రజలు సాక్షులుగా నిలిచారు. ప్రజల మద్దతును, మీడియా మద్దతుని, రాజకీయ మద్దతును ఇన్నాళ్ళు మూటగట్టుకొని తిరుగుతున్న బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు కుటుంబం ఒకే ఒక్క దెబ్బకు కుదేలైపోయింది. ఇక బాధితుడు దళితుడు అన్న విషయం పక్కన పెడితే ఈ రకంగా చూసినా ఇది ఎంతో అమానుషమైన చర్య.
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాత నగర్ లో దళిత యువకుడికి గుండు కొట్టించిన ప్రముఖ సినీ నిర్మాత నూతన్ నాయుడు మరియు అతని భార్య అరెస్టుకు అందరూ డిమాండ్ చేస్తున్నాడు. బాధితుడు కర్రీ శ్రీకాంత్ వయసు 20 సంవత్సరాలు. తన భార్య తన కళ్ల ముందే ఆ యువకుడికి శిరోముండనం చేస్తున్న ఘటన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. భార్య మధుప్రియ కు పూర్తి సహకారం అందిస్తున్న తన భర్త…. ఇంకా ఇంట్లో పనిచేసే వారంతా ఈ శిరోముండనం ఘటనకు సహకరించిన వారే. ఐఫోన్ చోరీ నెపంతో దళిత యువకుడిని హింసించి శిరోముండనం చేశారని, ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు దొరికాయి కమిషనర్ తెలిపారు.
దీంతో ఎలాగైనా నా ఈ విషయం నుండి తప్పించుకోవచ్చు అన్న నూతన్ నాయుడు ఆశలకు గండి పడింది. ఈ ఘటనలో నేరుగా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నూతన్ నాయుడు అతని భార్య మధుప్రియ అయితే A1 ముద్దయిలుగా పరిగణింపబడుతుండగా….ఇందిర, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాల పై కేసు నమోదు చేశామని సీపి మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. పైన చెప్పబడిన వారంతా నూతన్ ఇంట్లో పనిచేస్తున్న వారే.
ఇకపోతే ఏరకంగానూ ఇప్పుడు నూతన్ నాయుడు ఈ కేసు నుండి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఏమాత్రం ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు అహంకారంతో పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన నూతన్ నాయుడు ఇప్పటికే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అక్రమాలకు సంబంధించి వారు ఫైర్ లో ఉన్న దశలో ఇటువంటి అమానుషానికి పాల్పడడం అతని పాలిట శాపమైంది. ఇప్పుడు శిరోముండనం కి సంబంధించిన సిసి టివి ఫుటేజ్ వైరల్ అయింది. చోరీ చేసినంత మాత్రాన కుటుంబం అంతా కలిసి ఇంత దారుణంగా వ్యవహరించడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఇంకా అతను చోరీ చేసినట్లు కూడా పూర్తిగా ఆధారాలు లేవు. నిజంగా చోరీ చేషి ఉంటే.. అతడి పై ముందు కేసు పెట్టి చట్త ప్రకారం శిక్ష పడేలా చేయాలి కానీ… ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి అదే చట్టానికి దొరికిపోయి శిక్ష అనుభవింకూడదు నూతన్ నాయుడు.