ఉత్తరప్రదేశ్ : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ నాయకుల పోస్టర్లను తొలగించేందుకు ఒక కానిస్టేబుల్ కరెంటు పోల్ ఎక్కుతుండగా నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నందుకు ఒక పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఈ ఘటన జరిగింది.
నిన్న ఎన్నికల కమిషన్ లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించటంతో దేశమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించిన పధకాల ప్రకటనల హోర్డింగ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
అందులో భాగంగానే కానిస్టేబుల్ కరెంట్ పోల్ ఎక్కుతుండగా ఇన్స్పెక్టర్ నవ్వుతూ సెల్ఫీ దిగాడు. ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్పై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా ఆయన్ని రిజర్వ్లో ఉంచారు.
ఉత్తర ప్రదేశ్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11 న మొదటి విడత, ఏప్రిల్ 18 న రెండో విడత, ఏప్రిల్ 23 న మూడో విడత , ఏప్రిల్ 29 నాలుగవ విడత , మే 6 న ఐదొవ విడత, మే 12 న ఆరొవ విడత, మే 19 న ఎడొవ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉన్నావ్లో ఏప్రిల్ 29 న ఎన్నికలు జరగనున్నాయి.