RaghuramaKrishnamraju case: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టీవీ 9 కి షాక్ ఇచ్చారు. తన అరెస్టు కథనాలను అవాస్తవంగా ప్రసారం చేసినందుకు ఆ ఛానెల్ కి లీగల్ నోటీసులు ఇచ్చారు. బహిరంగంగా తప్పుని ఒప్పుకుని, క్షమాపణ చెప్పకుంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని, పరువు నష్టం చెల్లించాల్సిందే అంటూ నోటీసు ద్వారా హెచ్చరించారు. ఈ సందర్భంగా టీవీ 9 లో వేసిన కథనాలు, యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు, వాటి వ్యూస్, వాటి లెక్కలలు, వాటిలో తప్పులు అన్నిటినీ వివరంగా పేర్కొన్నారు. మొత్తం 11 పేజీల నోటీసులో మొదటి నుండి చివరి వరకు 43 పాయింట్లు చేర్చారు. ప్రతీ పాయింట్ ద్వారా టీవీ 9 లో ప్రసారమైన కథనం.. దానిలో తప్పు.. అందుకు తన దగ్గర ఉన్న ఆధారం పేర్కొన్నారు. వెంటనే దీనిపై స్పందించి, క్షమాపణ చెప్పకుంటే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. టీవీ 9 డైరెక్టర్ జగపతిరావు, సీఈఓ బరున్ దాస్, మేనేజింగ్ ఎడిటర్ రజనీ కాంత్, ఎక్సక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. తన అరెస్టు మొదలుకుని, ఆర్మీ ఆసుపత్రి నివేదిక, సుప్రీమ్ కోర్టులో విచారణ అన్ని వార్తలను టీవీ 9 తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రసారం చేసిందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి రఘురామ ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదు. లీగల్ గానూ.., ఒక ఎంపీగా తన హక్కులతోనూ ముందుకు వెళ్తున్నారు..