ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని అందరికీ తెలుసు. ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ ఆర్జీవీ చేసే వ్యాఖ్యలు తెరకెక్కించే సినిమాలు న్యూస్ ఫీల్డ్ లో హాట్ టాపిక్ అవ్వగా జనాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక లాక్డౌన్ సమయంలో అదరగొట్టే మసాలా లాంటి సినిమాలు తెరకెక్కించి ఓటీటీల ద్వారా రిలీజ్ చేసి భారీగానే సొమ్ము వెనకేసుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే హఠాత్తుగా ఆర్జీవి తన మకాం మొత్తం గోవాకి తరలించినట్లు తెలుస్తోంది. ఇకపై గోవాలోనే సినిమాలు తెరకెక్కించాలని ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గరవ్వాలని రాంగోపాల్ వర్మ సరికొత్త ప్లాన్ వేసినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం గోవాలో కొన్ని విల్లాలను లీజు పద్ధతిలో ఆర్జివి తీసుకున్నట్లు సమాచారం.
తన టీమ్ మొత్తం గోవాలో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒక పక్క తెలుగులో మరో పక్క బాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమాలు తెరకెక్కించే రీతిలో ఆర్జీవి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వస్తోంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ 12 o clock అనే సినిమాను ఆర్జీవీ హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తమ సత్తా చాటాలని మంచి ఆలోచన మీద ఉన్నాడు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.