రామ్ గోపాల్ వర్మ ఎలాంటి విషయాన్నైనా సంచలనం చేయడంలో నేర్పరి. సినిమా అయినా రాజకీయమైనా.. ఎంతటి వ్యక్తులనైనా వదలడు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుపై ఆయన స్పందించారు. శివాజీలో రజినీకాంత్ ఫేమస్ డైలాగ్.. ‘సింహం సింగిల్ గానే..’ అంటూ రఘురామరాజును పొగిడేశారు.
‘నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కానీ.. రఘురామకృష్ణ రాజు ఫీలింగ్ ఉంది. నిజం మాట్లాడటంలో సింహం.. ధైర్యంలో పులి’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయంగా కాక రేపేదే. ఎందుకంటే.. రఘురామకృష్ణరాజును సింహంతో పోల్చడం తప్పులేదు కానీ.. సింహం సింగిల్ గానే.. అని అక్కడితో ముగించడమే కలకలం రేపుతోంది.