చాలా సందర్భాల్లో, అనారోగ్యాలు వచ్చినప్పుడు… నీరు పొట్టలోకి చేరుతుంది. దాంతో పొట్ట ఉబ్బుతుంది. అలా నానాటికీ పొట్ట సైజు పెరిగిపోతూ ఉంటుంది.అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో అదనంగా నీరు చేరకుండా అడ్డుకుంటుంది. అలా జరగాలంటే రోజూ కి రెండు అరటిపండ్లను తీసుకోవాలి.ఈ అరటిపళ్ళు పొట్టలో నీరు చేరకుండా చేస్తాయి. అలాగే,ఆహారాలు ఫ్రై చేసినవి కాకుండా ఉడికించిన ఆహారాలు, కూరలు మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన సన్నగా అవుతారని పరిశోధకులు తెలిపారు.
అరటి లో ఉండే ప్రో-బయోటిక్ గుణాలు శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఈ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్నితీసుకుంటూ జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తాయి. ఎప్పుడైతే, జీర్ణక్రియ బాగా జరుగుతుందో అప్పుడు కొవ్వు పేరుకుపోయే పరిస్థితి ఉండదు. ఫలితంగా పొట్ట చుట్టూ, నడుం చుట్టూ కొవ్వుచేరకుండా ఉంటుంది . దాని తద్వారా పొట్ట మాయం అవుతుంది.
అరటి పండ్లలో B విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం లో కొవ్వును పేరుకోనివ్వదు. కొవ్వును పోగేసే జన్యువులు మన శరీరం లో ఉంటాయి. వాటిని చురుగ్గా లేకుండాచేయడానికి ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ జీన్స్ మొద్దుబారిపోతాయోఅప్పుడు ఇక కొవ్వు నిల్వ అవ్వదు. పొట్ట రాదుసరికదా ఉన్న పొట్టకూడ తగ్గిపోతుంది.
మీరు నిజంగా, చాల స్ట్రిక్ట్ గా పొట్ట రాకూడదు అని అనుకుంటే, రోజూ 2అరటి పండ్లను తినడంతో పాటూగా మసాలాలు, స్పైసీ ఫుడ్ ఫ్రైలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటివి తినడం తగ్గించాల్సిందే. ఎప్పుడైతే ఇలా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటారో అప్పడు చాలా త్వరగా పొట్ట తగ్గిపోతుంది అని పరిశోధకులు సలహాలిస్తున్నారు .కాబట్టి బరువు తగ్గాలనుకున్నవాళ్ళు పైన చెప్పినవిధం గా అరటి పళ్ళు తింటూ డైట్ చేసి చూడండి.