Sashikala :శశికళ Sashikala తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. ఈసారి అవి మరింత రసకందాయం గా కనిపిస్తున్నాయి. మార్చి ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జరుగుతున్న ఒక్కో పరిణామం ఒక్కో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అటు జాతీయ మీడియా అనే కాదు అన్ని రాష్ట్రాల మీడియా సైతం తమిళనాడు రాజకీయాల మీద ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత చెన్నై కి రావడం, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ఆమె రాజకీయ పావులు కదపడం ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తోంది.
ఎందుకీ హడావిడి!
ఇటీవల కరోనా నుంచి కోరుకొని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన చిన్నమ్మ శశికళకు ఘన స్వాగతం లభించింది అని చెప్పుకునే లోపలే.. ఆమె చెన్నై చేరుకునే సమయంలో ఆమె మద్దతుదారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఏకంగా రెండు వేల కార్లతో పెద్ద ర్యాలీ నిర్వహించడం ఆమెకు చెన్నై లోని ప్రతి కూడలిలో కార్యకర్తలు స్వాగతం పలకడం రాజకీయాల్లో వచ్చే మార్పులను సూచిస్తోంది. నిన్న మొన్నటి వరకు జైలు జీవితం గడిపిన ఆమె ఇప్పుడు బయటకు రాగానే వీఐపీగా మారడం అటుంచితే ఇటు తమిళనాడు రాజకీయాలలో శశికళ ఏం చేయబోతున్నారు అనేది కూడా కీలకంగా మారింది. చెన్నై రాక సందర్భంగా చిన్నమ్మ శశికళ కు స్వాగతం పలికిన వారిలో అన్నాడీఎంకే కార్యకర్తలు నాయకులు సైతం ఉన్నారు. దీంతో అధికార అన్నాడీఎంకే లో ముసలం స్టార్ట్ అయింది. శశికళ కచ్చితంగా భవిష్యత్తులో అన్నాడీఎంకే మొత్తం క్యాప్చర్ చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నారు అనేది Tamilanadu రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా సాగుతున్న చర్చ.
Shasikala : బీజేపీ ఏం చేయబోతుంది?
ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన చెన్నై చేరుకున్న శశికళ భవిష్యత్తులో అన్నాడీఎంకేకు ప్రాతినిధ్యం వహిస్తార లేక దినకరన్ నెలకొల్పిన పార్టీలో కొనసాగుతారా అన్నది కీలకం. అన్నాడీఎంకే ను వెనకుండి నడిపిస్తున్న బిజెపి దీనిలో ఎలాంటి వ్యూహం ఎంచుకొంటుంది? చిన్నమ్మ ను ఎలా బుజ్జగిస్తుంది అనేది కూడా చూడాలి. తమిళనాడులో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మీద ప్రజల్లో వ్యతిరేకత ఉండడం అనేది సహజం. ఇది ప్రతిపక్ష డీఎంకే కూటమికి అనుకూలంగా మారకుండా ఉండేందుకు ఇప్పుడు బిజెపి వేసే ఎత్తులతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి డీఎంకే కూటమికి నష్టం చేకూర్చే పనికీ దారులు వెతుకుతోంది.
Jayalalitha వారసత్వం కోసం…
తమిళనాడు ప్రజలందరికీ అమ్మలా చెప్పుకుని జయలలిత వారసత్వం కోసం అన్నాడీఎంకే లో పోరు జరుగుతోంది. మరోపక్క శశికళ సైతం జయలలితకు అత్యంత ఆప్తులు రాలిని తానే అనేలా, ఆమె తర్వాత ఆమె వారసురాలు తానే అనే ప్రకటించుకునే ఎత్తులను వేస్తున్నారు. ఇటీవల ఆమె హాస్పటల్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో జయలలిత హావభావాలు పలికిస్తూ జయలలిత వాడిన కారు లో కూర్చున్నారు. కారుకు ఉన్న జెండా సైతం అన్నాడీఎంకే పార్టీ ది కావడంతో పాటు ఆమె ప్రజలను పలకరించే తీరు సైతం జయలలితను మైమరపించే లా కనిపించింది. దీంతో ఇది అన్నాడీఎంకే నేతలను కలవరపాటుకు గురిచేసింది.
ఎప్పటికీ జయలలిత అన్నాడిఎంకె నాయకురాలు గానే ఉంటారని, బయట వ్యక్తులు ఆమె పేరు చెప్పుకొని లాభ పడడానికి చూస్తున్నారంటూ ప్రచారానికి అన్నాడీఎంకే నాయకులు తెరలేపారు. దీనిని ఏమాత్రం పట్టించుకోని చిన్నమ్మ శశికళ తన మొండి ధైర్యంతో తన స్నేహితురాలు జయలలిత వారసత్వం కోసం ఆమె మీద తమిళనాడు ప్రజలకు ఉన్న సానుభూతి నీ ఓట్ల రూపంలో పొందేందుకు స్కెచ్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి అన్నాడీఎంకే లో కొందరు ఎమ్మెల్యేలు సైతం శశికళ వెంట నడుస్తారు అన్న టాక్ తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే మరో రెండు నెలల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ప్రతిరోజు ఏం జరుగుతుంది..? హాయ్ కుల తీరు ఎలా ఉంది అనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది.