బాలనటుడిగా వెండితెరకు పరిచయమై రాజకుమారుడు సినిమాతో ఉత్తమ నటుడిగా పురస్కారం పొంది.. వెండితెరపై సూపర్ స్టార్ గా పేరుసాందించుకున్నాడు ప్రిన్స్ మహేశ్ బాబు. రాజకుమారుడు తర్వాత ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలతో దూకుడుగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. తెలుగు నాట యువకులు, పెద్దలతో పాటు క్లాస్, మాస్ ఆడియోన్స్ లో మంచి పేరు సంపాదించుకుని వెండితెర సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.
అయితే, కరోనా నేపథ్యంలో సినిమా షూటింగులు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ నటిస్తున్న సినిమాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. చాలా కాలం తర్వాత గ్యాప్ దొరకడంతో దానిని కమర్షియల్ గా వాడుకున్నాడట మహేశ్. ఎలా అనుకుంటున్నారా? అదేనండి యాడ్స్ చేయడంతో.. ఎందుకంటే కమర్షియల్ యాడ్స్ చేయడంతో తెలుగు హీరోలలో సూపర్ స్టార్కు దరిదాపుల్లోకి ఎవరూ రారు. ఆయనకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి.. !
అయితే, తాజా గ్యాప్ నేపథ్యంలో మహేశ్ కమర్షియల్ ప్రకటనలపై విభిన్నమైన కథనాలు హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఆయన ప్రకటనల్లో లుక్స్ హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే అందుల్లో భిన్న కోణాల్లో కనిపిస్తున్నారు. అసలు విషయమేంటంటే.. ఇరవై ముప్పై సెకండ్లపాటు కనిపించే ఈ యాడ్స్ కోసం సూపర్ స్టార్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం దొరికిన గ్యాప్ లో చేసిన యాడ్స్ ద్వారా మహేశ్ దాదాపు రూ.పాతిక కోట్ల దాకా సంపాదించారట.
అయితే, ఈ విషయం బాగానే ఉన్నా.. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన దాని కంటే అధికంగానే సూరప్ స్టార్ మహేశ్ పోగొట్టుకున్నారట? అదేంటి అనుకుంటున్నారా? అదేనండి తన గ్లామర్ క్రేజ్. తన గ్లామర్కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇప్పటికీ కుర్రకారు మహేశ్ అంటే పడిచస్తారు. అయితే, తాజా ప్రకటనలతో .. ఇన్స్టంట్ మెకోవర్ కారణంగా తన ఒరిజినల్ గ్లామర్ను పోగొట్టుకున్నారని ఆయన ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. యాడ్స్ తో భిన్న గెటప్స్ నటించిన మహేశ్.. అభిమానులతో పాటు అందరినీ కన్ఫ్యూజ్ కు గురిచేశారు. ఈ యాడ్స్ కారణంగా మహేశ్ లో గ్రేస్ తగ్గిందన్న హాట్ హాట్ కామెంట్ల నేపథ్యంలో.. సూపర్ స్టార్ పొందినదాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!