హైదారాబాద్ దేశానికే పెద్ద దిక్కు.. దేశానికి రెండో రాజధాని చేయాలనే ఆలోచన కూడా హైదరాబాద్ విషయంలో ఉంది.. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా నిలిచి గెలిచి భాగ్యనగరం కాస్తా విశ్వనగరంలా మారబోతోంది అంతూ హైదరాబాద్ గురించి ఊదరగొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. నేడు హైదరాబాద్ ను వదిలి ఎర్రవల్లెలో సెటిల్ అయ్యరాని అంటున్నారు! ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం ఇది!
ఇంత గొప్ప రాజధానికి, ప్రగతి భవన్ ను వదిలి కేసీఆర్ ప్రస్తుతం ఫాం హౌస్ లో తలదాచుకుంటున్నారు! అక్కడినుంచే పరిపాలన సాగించాలని నిర్ణయించుకున్నారు! అవును… హైదరాబాద్ లో కరోనా కేసులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దాంతో భాగ్యనగరం బ్లాస్ట్ అవుతుందా అని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఈ క్రమంలో… తన ఆరోగ్యం తాను చూసుకునే క్రమంలో విశ్వనగరాన్ని వదిలి ఎర్రవల్లె లోని తన ఫాం హౌస్ కు వెళ్లిన కేసీఆర్.. అధికారులకు కొత్త సూచనలు చేశారు!
ఇందులో భాగంగా కరోనా మహమ్మారి తగ్గేంతవరకూ ఎర్రవల్లి విడిచి రాకూడదని నిర్ణయించుకున్న కేసీఆర్… ఇక అక్కడ నుంచే వీడియో సమావేశాల ద్వారా రాష్ట్రంలో పాలన చక్కబెడతారుట. ఇందులో భాగంగా.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ ని అధికారులు అప్ డేటెడ్ టెక్నాలజీతో తీర్చిదిద్దడంతోపాటు… అక్కడ నుంచే మంత్రులు అధికారులను అలెర్ట్ చేస్తూ పాలన సాగించడానికి అనువైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారంట!