Revanth Reddy: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన సూరీడు అందరికీ తెలుసు. వైయస్ చనిపోయిన తర్వాత ఆయన పాత్రపై అనేక అనుమానాలు రాగా తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి పోవడం జరిగింది. అటువంటి సూర్యుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చివరి రోజు .. ముగింపు సభలో పాల్గొనడం తెలుగు రాజకీయాలలో సంచలనం సృష్టించింది.
ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి రావటంతో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను ఒక్కొక్కరిని కలుస్తూ వారి ఆశీస్సులు అందుకుంటూ కలిసి పని చేసే రీతిలో మంతనాలు జరుపుతున్నారు. అంతేకాకుండా పార్టీ బలోపేతం కోసం వారి దగ్గర సూచనలు మరియు సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాజాగా వైయస్ అనుచరుడు సూరీడు ని కలవడం జరిగింది. దీంతో మరోసారి సూరీడు పేరు తెలుగు రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.