టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి సీజన్ ఫోర్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎలిమినేషన్ విషయంలో ఓట్ల పరంగా కాకుండా స్క్రిప్టు పరంగా షో నిర్వాహకులు ఆమెను కావాలని ఎలిమినేట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఇటీవల షో క్లైమాక్సు కి చేరుకున్న నేపథ్యంలో రీయూనియన్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ లు అందరూ రాగా దేవి నాగవల్లి మిస్ అవ్వడం జరిగింది.
ఇదే టైమ్ లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కూడా ఆమె రాలేదు. దీంతో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో దేవి నాగవల్లి పై వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దేవి నాగవల్లి సోషల్ మీడియాలో వీడియో రూపంలో ఓ పోస్టు రిలీజ్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఆనందం కలిగిందని తెలిపింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు వాటి ఉద్దేశాలు ముందే నాకు అర్ధమైపోయేవి అని తెలిపింది.
కట్టప్ప టాస్క్ కూడా నాకు ముందే తెలుసు ఎవరు కట్టప్ప లేరని అని చెప్పుకొచ్చింది. అయితే హౌస్ లో షో నిర్వాహకులు తగ్గట్టు రీతిలో కంటెస్టెంట్ లు నడవాలని వాళ్ళు ఆశించారు ఏమో తెలియదు గానీ, దీంతో వాళ్ళ మైండ్ సెట్ కి నేను సరిపోను అని అనుకున్నారో ఏమో తెలియదు గానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బాగా ఎంజాయ్ చేశాం అంటూ దేవి నాగవల్లి తాజాగా వీడియో పోస్ట్ చేసింది.