ఎంత చెప్పినా.. ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొందరూ మారడంలేదు. ఏ పాపం ఎరుగని వన్య ప్రాణులు మాత్రం వీరి ఉచ్చులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఎవడో భారీగా డబ్బులు ఇస్తాడని తెలియగానే.. కనుమరుగైతున్న వన్యప్రాణులను కూడా వదలకుండా పట్టుకుని హింసిస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నా.. వీరిలో మార్పు రావడం లేదు. వన్యప్రాణులను హింసించేవారిపై ఇంకా కటినంగా ఉండాలని పలువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా చూడాలని కోరుతున్నారు.
విషయానికి వస్తే.. రెండు సాండ్ బోవా పాములను పుణె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాములను అక్రమంగా బ్లాక్ మార్కెట్లో అమ్మేందుకు తీసుకుపోతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. మాములు పాముల్లానే పొడవుగా, లావుగా ఉండే ఈ సాండ్ బోవా చాలా అరుదైనవి. వేగంగా అంతరించి పోతున్న జీవుల్లో ఇది ఒకటి. వీటిని కాపాడుకోవల్సిన అవసరం చాటా ఉంది. అయితే ఇలాంటి అరుదైన పాములను ఫైసలకోసం బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారు.
ఈ సాండ్ బోవా పాము ఖరీదు సుమారు 25 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఔషదాలు, తాంత్రిక పూజల్లో వీటిని వాడుతారని గుసగుసలు వినిపిస్తాయి. అందుకే ఈ సాండ్ బోవాలకు అంత డిమాండ్ అని పలువురు చెబుతుంటారు. ఈ సాండ్ బోవాలు చూసేందుకు పాముల్లాగే ఉన్నా.. విషం ఉండదు. వీటి తోక భాగం కూడా ముఖంలాగానే అనిపిస్తుంది. అందుకే వీటికి రెండు తలల పాము అని కూడా పిలుస్తారు.
పుణెలోని కాట్రాజ్-కొంద్వా రోడ్లో పోలీసులు సోదాలు చేస్తుంటే.. ఒక వ్యక్తి దగ్గర ఆ పాములను చూసీ వాటిని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వన్యప్రాణులను హింసించే ప్రయత్నం చేస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.