పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలు సినిమాలకు దూరం కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవ్వగా దాదాపు మార్చి నెల వచ్చేసరికి 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేసారు పవన్. ఈ సినిమా కరోనా వైరస్ రాకుండా ఉండి ఉంటే ఈ ఏడాది వేసవి కాలంలో మే 15వ తారీఖున రిలీజ్ అయి ఉండేది. మహమ్మారి రావటంతో పరిస్థితులను మారిపోవడంతో బ్యాలెన్స్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది.
రాబోయే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమా చేస్తుండగానే డైరెక్టర్ క్రిష్ తో కూడా పవన్ సినిమా ఒప్పుకోవటం, స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు రెండు అతిపెద్ద షెడ్యూల్ లు పవన్ కంప్లీట్ చేశారు. మరోపక్క హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఇటీవల దసరా పండుగ నాడు సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్న “అయ్యప్పన్ కోషియం” తెలుగు రీమేక్ లో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ మొదట నందమూరి బాలకృష్ణ వద్దకు వెళ్లినట్లు ఆయన తొలుత ఓకే అని చెప్పి చేయాలని ముందుకు వచ్చారని కానీ తర్వాత అనుకోని కారణాలవల్ల ఈ కథ పవన్ వద్దకు వెళ్లినట్లు ఇప్పుడు బాలయ్య చేయాల్సిన సినిమా పవన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!