ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కరోనా వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అందులోనూ నిర్విరామంగా శాస్త్రవేత్తలు తన ప్రయోగాలను అలుపెరుగకుండా చేస్తూనే ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి భారీ నుంచి ప్రజలను రక్షించేందుకు పరిశోధనలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరింత మంది దీని నుండి బలి కాకుండా కాపాడేందుకు చర్యలు రోజు రోజుకూ ఊపందుకుంటూనే ఉన్నాయి.
కాగా మేము 90 శాతం కరోనా టీ కాను తయారు చేయడంలో విజయం సాధించామనీ ఫైజర్ బయోఎన్ టెక్ ఇంతకు ముందు ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫైజర్ బయో ఎన్ టెక్ తాజాగా తమ టీకా రెడీ అయ్యిందని ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లోనూ కరోనా టీ కాను ప్రవేశింపపెట్టనున్నట్టు ఈ టీకా అభివఈద్ధిలో పాలుపంచుకుంటున్న సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు.
కాగా ఈ టీకాను ఆరు దేశాలకు చెందిన 43 వేల మంది వాలంటీర్లపై ఫైజర్ బయో ఎన్ టెక్ టీకాను మూడు దశల్లోనూ ప్రయోగాలు చేపట్టారు. కాగా ఈ టీకాను తీసుకున్న వాలంటీర్లలోనూ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలిపారు. కాగా తాజాగా ఈ టీకాను విడుదల చేయనున్నట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
అయితే ఈ వ్యాక్సిన్ ను ఫైజర్, బయో ఎన్ టెక్ అనే సంస్థలు కలిసి తయారుచేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన్ వ్యాక్సిన్ డోసులను వచ్చే సంవత్సరానికి సరఫరా చేయనునట్టు బయో ఎన్ టెక్ సంస్థ సీఈఓ ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్ స్పష్టం చేశారు. చూడాలి మరి ఈ వ్యాక్సిన్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో..