Vizag as AP capital: అమరావతి నుండి తీర నగరమైన విశాఖపట్నంకు రాష్ట్ర రాజధానిని (పరిపాలన) మార్చడం వలన నగరంలోని కీలక రహదారులు మరమత్తుల దశలో ఉన్నాయి. వైజాగ్ యొక్క పౌరసంఘం ఈ నిర్మాణ పనులను పెద్ద ఎత్తున జరిపిస్తోంది.
విమానాశ్రయం నుండి నగరానికి రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడంపై సంబంధిత విభాగాలు దృష్టి సారించాయి. నగరంలో అనుసంధాన రహదారిని నిర్మిస్తున్నారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పెద్ద జంక్షన్లలో కూడా విస్తరించబడతాయి.
ప్రస్తుతానికైతే ప్రముఖ విద్యా సంస్థకు చెందిన ఒక పెద్ద భవనం సచివాలయంగా పనిచేస్తుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. విమానాశ్రయం మరియు విద్యా సంస్థ-భవనం ఉన్న ప్రాంతాన్ని అనుసంధానించే విధంగా ప్రత్యేక రహదారిని రూపొందించారు.
దానికి తోడు రహదారి పొడిగింపులు కూడా క్రమేపీ జరుగుతున్నాయి. ఇక ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. 35 కిలోమీటర్ల పొడవైన రహదారి నాలుగు ప్రాంతాలలో విస్తరించనుంది.
ఇకపోతే వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములలో ఆస్తులను కోల్పోయిన వారికి ఎలా పరిహారం అందుతుందనే దానిపై అధికారిక ప్రకటన చేస్తామని చెబుతున్నారు.
ఇలా కరోనా రెండవ వేవ్ ముప్పు ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోతుందో… ఆ వెనువెంటనే విశాఖ నగరం నుండి జగన్ తన పరిపాలన కొనసాగించనున్నట్లు అర్థం అవుతోంది. అలాగే మొన్న అమిత్ షా తో జరిగిన దిల్లీ సమావేశంలో కూడా ఈ విషయమై చర్చించి, కర్నూలుకి హై కోర్టు ని మార్చేందుకు కేంద్రం మద్దతు అడిగిన విషయం తెలిసిందే.